తెలుగు జాతికి, తెలుగు బాషకి ఒక విశిష్టత ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స.. అన్నాడు ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు. అంతటి ప్రసంస్త్య కలిగిన తెలుగునాట జన్మించిన తెలుగువాడు వేమన్న. 'ఉప్పుకప్పురంబు నోక్కపోలికనుండు....' అంటూ మనవులలోని భిన్నత్వాలను... 'తప్పులెన్నువారు తండోపతండంబులు.....' అంటూ వ్యవస్ధగత దోషాల్ని.... 'ధనమేచిన మదమేచును....' అంటూ అహంకారాన్ని, లోకరితులను తన సున్నితమైన పద్యాల ద్వార ప్రపంచానికి చాటిన తెలుగువాడు వేమన.