వివిధ సందర్భాలలో చాలా తక్కువ కథలు మాత్రమే రాసిన రచయిత శేషేంద్ర.
పసిపిల్లల నడుమ స్నేహం పాదుకోవడానికి వాళ్ళ ఆర్థిక, సామాజిక నేపథ్యాలేవీ ప్రతిబంధకాలు కావని హృద్యంగా విప్పి చెప్పిన కథ విహ్వల. హిరణ్యయి స్త్రీ పురుషుల నడుమ ఉత్పన్నమయ్యే గాఢమైన ప్రేమకు వయసు, ఇతర భౌతిక కారణాలేవీ హేతువులు కావనీ, స్వచ్ఛమైన ఆరాధనే ప్రధానమనీ కవితాత్మకంగా చెప్పే కథ. అదే విధంగా పేద జాలరి బతుకు చిత్రం రంగుల చేప. హరిణ, ఎగిరిపోయిన హంస కథలు కూడా పాఠకుణ్ణి కలచివేసే స్థాయితో విలక్షణ వచనంలో సాగుతూ, కవిత్వ పరిమళాన్ని వెదజల్లే కృతులు.